ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి దారుణ హత్య

by Dishafeatures2 |
ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ చౌహాన్ (19) ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ ఆర్యభట్టలో బీఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే కాలేజీకి వచ్చిన నిఖిల్ పై మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో నలుగురు సభ్యులు గల గ్యాంగ్ అటాక్ చేసింది. అతడి ఛాతీ, పొట్ట భాగాల్లో కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు దుండగులు. రక్తపు మడుగులో ఉన్న నిఖిల్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం నిఖిల్ మృతి చెందాడు.

కాగా నిఖిల్ హత్యకు వారం రోజుల కిందట జరిగిన ఓ ఘటనే కారణమని నిందితులు పోలీసులు తెలిపారు. వారం కిందట మృతుడు నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉండగా నలుగురు నిందితుల్లోని ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా నిఖిల్ అతడితో గొడవకు దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ పై కోపాన్ని పెంచుకున్న నిందితుడు తన స్నేహితులు ముగ్గురితో కలిసి నిఖిల్ ను కత్తితో పొడిచి పారిపోయినట్లు తెలిపారు. కాగా నిందితులు నలుగురు అదే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed