మిస్టరీ స్విమ్మింగ్ ఫూల్స్.. ఇద్దరు చిన్నారులు మృతి

by Disha Web Desk 4 |
మిస్టరీ స్విమ్మింగ్ ఫూల్స్.. ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాష్ట్రం అనకాపల్లిలో చిన్నారులను స్విమ్మింగ్ ఫూల్స్ మింగేయడం సంచలనంగా మారింది. మూడు వారాల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ ఫూల్స్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. గత నెల 17న ప్రభాస్ అనే యువకుడి మృతి చెందగా.. తాజాగా పవన్ సాయి అనే 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. స్విమ్మింగ్ ఫూల్స్ యజమానులు నిబంధనలు పాటించడం లేదని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సమ్మర్‌లో సరదా కోసం, ఈత నేర్చుకోవడం కోసం స్విమ్మింగ్ ఫూల్స్‌కు చాలా మంది తమ చిన్నారులను తీసుకెళ్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు చనిపోవడం ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed