- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
by Bhanu |
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందిన ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ గ్రామ శివారులో శనివారం..

X
దిశ, నకిరేకల్ టౌన్ : రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందిన ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన పిట్టల శంకరమ్మ (45), ఆమె కుమారుడు రజినీకాంత్ (26) బైక్పై నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో బంధువు దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు.
తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో కట్టంగూర్ గ్రామ శివారులో రోడ్డుపై నిలిపిన ట్రాలీ లారీని వెనుక నుండి ఢీకొట్టాడు. దీంతో రజినీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా, శంకరమ్మ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం నార్కట్పల్లి కామినేని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.
Next Story






