రాష్ట్రంలో దారుణం.. తల్లి, ఇద్దరు కూతుర్ల హత్య

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

రాష్ట్రంలో దారుణం.. తల్లి, ఇద్దరు కూతుర్ల హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ(Kakinada) జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి, ఇద్దరు కుమార్తెలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య(Murder) చేశారు. శనివారం రాత్రి ఇంట్లోకి చొరబడి అత్యంత దారుణంగా చంపారు. ఆదివారం ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు మృతులు తల్లి ములపత్తి మాధురి (30), కూతుర్లు పుష్ప కుమారి(05), జెస్సిలోన (04)లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story