ఎయిర్ పోర్ట్ లో విదేశీ కరెన్సీ పట్టివేత

by Disha Web Desk 1 |
ఎయిర్ పోర్ట్ లో విదేశీ కరెన్సీ పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ప్రయాణికురాలు జీన్‌ అల్విసా మొహమ్మద్‌పై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఆమె వద్ద ఉన్న 54 యునైటెడ్ ఎమిరేట్స్ దీరమ్స్ కరెన్సీ నోట్లను గుర్తించి స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన కరెన్సీ విలువ సుమారు రూ.9.67లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed