మోడల్ హత్య.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్ భోపాల్‌లో మోడల్ హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. మోడల్ ఖుష్బు అహిర్వార్ అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో..

మోడల్ హత్య.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ భోపాల్‌లో మోడల్ హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. మోడల్ ఖుష్బు అహిర్వార్ అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పక్కింటి వారు. దీంతో పోలీసులు తలుపు తెరిచి చూడగా నిర్జీవంగా ఉంది. కాగా ఆమెను చంపింది ప్రియుడు ఖాసిమ్ అహ్మద్ అని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. తాము చూసినప్పుడు ఖుష్బు శరీరంపై గాయాలు ఉన్నాయని.. కచ్చితంగా అతనే మర్డర్ చేసి ఉంటాడని చెప్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖాసిమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మోడల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story