గర్ల్ ఫ్రెండ్ను చంపడానికి కొన్ని నిమిషాల ముందు సాహిల్ ఏం చేశాడో తెలుసా?

by Dishafeatures2 |
గర్ల్ ఫ్రెండ్ను చంపడానికి కొన్ని నిమిషాల ముందు సాహిల్ ఏం చేశాడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి సాక్షి అనే ఓ 16 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు కత్తితో పొడిచి.. అనంతరం బండరాయితో మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. దాదాపు 22 సార్లు నిందితుడు ఆమెను కత్తితో పొడిచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక ఈ హత్యా ఉదంతం సీసీటీవీలో రికార్డు కాగా దాని ఆధారంగా పోలీసులు హంతకుడు సాహిల్ ను సోమవారం అరెస్ట్ చేశారు. అయితే హంతకుడు తన ప్రియురాలిని హత్య చేయడానికి కొన్ని నిమిషాల ముందు తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభ్యమైంది. తన ఫ్రెండ్ ఆకాశ్ తో నిందితుడు సాహిల్ ఆ వీడియోలో మాట్లాడుతూ కనిపించాడు. ప్రియురాలిని చంపబోతున్న విషయం తన ఫ్రెండ్ కు ముందే చెప్పి ఉండొచ్చని ఆ వీడియోను చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. క్షణికావేశంలో కాకుండా పక్కా వ్యూహం ప్రకారమే అతడు తన గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేసినట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇక పోలీస్ కస్టడీలో ఉన్న సాహిల్ హత్యకు గల పలు కారణాలను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా తనతో లవ్ లో ఉన్న సాక్షి కొన్ని రోజులుగా తనను దూరం పెడుతోందని, తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ ప్రేమలో పడిందని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అంతేగాక తనను వేధించవద్దని, అలా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సాక్షి బెదిరించడంతో తనను హత్య చేసినట్లు నిందితుడు సాహిల్ పోలీసుల ముందు ఒప్పకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా పోలీస్ విచారణలో హంతకుడు సాహిల్ లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు.


Next Story

Most Viewed