భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన కేసులో ట్విస్ట్.. ఆ ఎఫైర్ వల్లే!

by Ajay Maddhiboyina |

భార్యను హత్య చేసి ఆపై ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన కేసులో ట్విస్ట్.. ఆ ఎఫైర్ వల్లే!
X

దిశ‌, వెబ్ డెస్క్: భార్యను హత్య చేసి ఆపై ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మీర్‌పేట్‌లో ఈ దారుణం జరగ్గా ఇప్పటి వరకు 11నెలలు పూర్తైంది. కాగా 11నెలల తరవాత కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. నిందితుడు గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో భార్యతో పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలిసింది. అనేకసార్లు పంచాయితీలు పెట్టినా గురుమార్తి తీరు మారలేదు.

భార్యను హతమార్తి మరదలితో ఉండేందుకే గురుమూర్తి ఈ ఏడాది భార్యను పథకం ప్రకారం హతమార్చాడు. అసలు ఆధారాలే దొరకకుండా శరీర భాగాలను కోసివేసి కుక్కర్ లో ఉండకబెట్టి, పొడి చేసి చెరువులో కలిపేశాడు. అప్పట్లో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. గదిలో మృతురాలికి సంబంధించిన చిన్న చిన్న ఆన‌వాళ్లు ల‌భించ‌డంతో డీఎన్ఏ టెస్టు ద్వారా పోలీసులు కేసును చేదించారు. ఇక పదకొండు నెలల తరవాత గురుమూర్తి నోరువిప్పి మరదలితో ఎఫైర్ కారణంగానే భార్యను హతమార్చినట్టు ఒప్పుకున్నాడు.

Next Story