- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలలో భారీ చోరీ...తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం
జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో దొంగలు రెచ్చిపోయారు.

X
దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి బంగారు నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. తోట ప్రసాద్ అనే వ్యక్తి దసరా పండుగ నేపథ్యంలో ఇంటికి తాళం వేసి సొంత ఊరైన కరీంనగర్ వెళ్లారు. విషయం గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా పగలగొట్టి సుమారు ౪ తులాల బంగారంతో పాటు 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రసాద్ జగిత్యాల చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Tags
- theft
Next Story






