టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9కి చేరిన మృతుల సంఖ్య

by Disha Web Desk 12 |
టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. పోలీసులు సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదం.. పశ్చిమ బెంగాల్‌లోని ఎగ్రాలో అక్రమ పటాకుల ఫ్యాక్టరీలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. గత వారం పోలీసులు ఫ్యాక్టరీ పై దాడి చేసినప్పటికీ ఏమీ లభించలేదని పుర్బ మేదినీపూర్ ఎస్పీ అమర్‌నాథ్ తెలిపారు. అయితే భారీ పేలుడు కారణంగా అమాయకులైన కూలీలు చనిపోవడంతో సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టరీ యజమాని ఒడిశాకు పారిపోయారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed