వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య..
X

దిశ, శంషాబాద్ : వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని తేజస్వి నగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం చించోడుకు చెందిన రత్నదీప్, నందిని ఇద్దరు భార్యాభర్తలు. వీరు గత కొంతకాలంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రత్నదీప్, నందినిలకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి తన అత్తారింటివారు అదనపు వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని పెద్దలకు నందిని తెలిపింది. దాంతో నందిని అత్తారింటివారికి పెద్దమనుషులు ఎంత నచ్చచెప్పినా వినలేదు.

ఆ తరువాత భర్త, అత్తమామలు నందినిని రెట్టింపు వేధింపులకు గురిచేశారు. ఆ వేధింపులకు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని (24) ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. భర్త రత్నదీప్, అత్తమామలు విజయ, లక్ష్మన్ రావు వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్త రత్నదీప్ ను అరెస్టు చేసి అత్తమామల గురించి వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed