వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య..
X

దిశ, కోడేరు : మండల పరిధిలోని కోడేరు గ్రామానికి చెందిన ఓర్సు మాసయ్య కూతురు బాలమణి వయస్సు (19) (వడ్డెర) 11 నెల క్రితం మానవపాడు తరుణ్ (ఎరుకలి) ను ప్రేమించి వివాహం చేసుకుందని వారి బందువులు తెలిపారు. కులాంతర వివాహాం చేసుకున్న బాలమణిని అత్త మానవపాడు జ్యోతి, మామ మానవపాడు పెద్ద పోశయ్య, భర్త మానవపాడు తరుణ్, లు కలిసి అమ్మాయిని వరకట్నం తెమ్మని రోజు వేధింపులకు గురి చేసే వారని ఆ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి తేది 14-06-2023 రోజు చనిపోయినట్లు కోడేరు మండల ఎస్సై వి శేఖర్ రెడ్డి తెలిపారు. తేది:15-06-203 రోజు అమ్మాయి తల్లిదండ్రులు కోడేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఎస్సై వి శేఖర్ రెడ్డి తెలిపారు. వేధింపులకు గురిచేసిన అత్త మానవపాడు జ్యోతి, మామ మానవపాడు పెద్ద పోశయ్య, భర్త మానవపాడు తరుణ్ లపై కేసునమోదు చేసినట్లు ఎస్సై వి.శేఖర్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed