- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ఎయిర్పోర్టులో రూ. 39 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
విదేశాల నుంచి భారత్ కు గంజాయి స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది. నిత్యం పదుల సంఖ్యలో పట్టుబడుతున్నప్పటికి స్మగ్లర్లు గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం మానడం లేదు.

దిశ, వెబ్ డెస్క్: విదేశాల నుంచి భారత్ కు గంజాయి స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది. నిత్యం పదుల సంఖ్యలో పట్టుబడుతున్నప్పటికి స్మగ్లర్లు గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం మానడం లేదు. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడటం కలకలం సృష్టించింది. కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ. 39 కోట్ల విలువైన 39 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇటీవల కాలంలో ముంబై ఎయిర్పోర్టులో పట్టుబడిన అతిపెద్ద గంజాయి రవాణా కేసుల్లో ఒకటిగా నిలుస్తోంది.
బ్యాంకాక్ నుంచి ముంబైకి ఈ భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి అంతర్జాతీయ మార్కెట్లో భారీ విలువ కలిగి ఉందని, ఇది ఎయిర్పోర్ట్ ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఎంత విస్తృతంగా జరుగుతుందో తెలియజేస్తోందని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు, ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.






