- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్య ఛాతీపై రివాల్వర్ పెట్టి కాల్చాడు.. కానీ అదే బుల్లెట్కు బలయ్యాడు
దిశ, వెబ్ డెస్క్: రివాల్వర్ తో భార్యను కాల్చాడు ఓ భర్త. కానీ అదే బుల్లెట్ రివర్స్ రావడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ జిల్లాలో జరిగింది. మొరదాబాద్ రూరల్ ఎస్పీ సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మొరదాబాద్ కు చెందిన అనెక్ పాల్ (40), సుమన్ పాల్ (38) అనే దంపతులు చండీగఢ్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా ఇటీవలే వారు తమ స్వస్థలం మొరదాబాద్ కు వచ్చారు. అయితే గత వారం రోజులుగా భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 13 అర్ధరాత్రి దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది.
దీంతో భార్యను కౌగిలించుకున్న భర్త.. ఆమె ఛాతీలో తుపాకి పెట్టి కాల్చాడు. అయితే బుల్లెట్ ఆమె ఛాతీ నుంచి గోడకు తాకి రివర్స్ వచ్చి భర్తను గుండెను చీల్చుకుంటూ బయటకు వెళ్లిపోయింది. బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే అనెక్ పాల్ తన భార్యను చంపడానికి ముందు క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్షుద్ర పూజలు ఎందుకు చేశాడు? అసలు అతడి రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.