ఆలయ పుష్కరిణిలో మునిగి వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
ఆలయ పుష్కరిణిలో మునిగి వ్యక్తి మృతి
X

దిశ, జహీరాబాద్: మండలంలోని బాదంపేట రాచ్చన్న స్వామి ఆలయ ఆవరణలో గల పుష్కరిణిలో ఓ వ్యక్తి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో బిలాల్ పూర్ గ్రామానికి చెందిన ఎం.లక్ష్మయ్య కుమారుడు చంద్రరాజ్(24) మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పి.ప్రశాంత్ (అగ్నిమాపక అధికారి), ఎండీ. రఫీ (లీడింగ్ ఫైర్‌మెన్), ఫైర్‌మెన్లు ఎండీ.యూనస్ రంగ ప్రవేశం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కోసం ఎంత వెతికినా జాడ తెలియ లేదు. ఘటనా స్థలంలో వెలుతురు లేకపోవడంతో గాలింపు చర్యలు వాయిదా వేశారు.

Next Story

Most Viewed