- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మండలంలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి రమేష్ (45) అనే వ్యక్తి గత రెండు రోజులుగా పనుల నిమిత్తం తీవ్రమైన ఎండలో తిరిగారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. రమేష్ మరణంతో సింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన నీరటి రమేష్ కుటుంబం అత్యంత పేదరికంలో ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదించే వ్యక్తిని కోల్పోయి రోడ్డున పడిన ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Next Story






