రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...
X

దిశ, తానూర్ : మండలంలోని హిప్నెల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు తానూర్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఏల్వి గ్రామానికి చెందిన జోరిగల్ ధర్మాన్న (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు ధర్మాన రోజు తాపీ మేస్త్రి పని చేస్తుండే వాడు. మంగళవారం మేస్త్రి పనుల నిమిత్తం ముదోల్ మండల కేంద్రనికి వెళ్లాడన్నారు.

పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఎల్వి గ్రామ సమీపంలో ముందర వెళ్తున్న ఇటుకల ట్రాక్టర్ ను ధర్మాన్న వెనక నుంచి ఢీ కొట్టాడని తెలిపారు. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై విక్రమ్ వెల్లడించారు. మృతునికి భార్య చంద్రకళ తో పాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.

Next Story

Most Viewed