ఉప్పర్పల్లిలో గుండెపోటుతో వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
ఉప్పర్పల్లిలో గుండెపోటుతో వ్యక్తి మృతి..
X

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన దేవేందర్ గౌడ్ (40) గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఉదయం వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆయన ఛాతీలో కొద్దిగా నొప్పి వస్తుందని భార్యకు చెప్పగా ఆమె వెంటనే ఆసుపత్రికి పోదాం పదా.. అంటూ ఇద్దరు దేవేందర్ గౌడ్ బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పి అధికం అయ్యింది.

దీంతో రోడ్డు పక్కన ద్విచక్రవాహనం ఆపి అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి వెళ్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ డీసీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. దేవేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసిన యువనేతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడని వారు గుర్తుచేశారు.



Next Story

Most Viewed