విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి..
X

దిశ, మేళ్లచెరువు : విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని శివబాలాజీ నగర్ తండాలో ఆదివారం జరిగింది. ఎస్సై సురేష్ యాదవ్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. శివ బాలాజీ తండాకు చెందిన బానోతు చంద్రియా (65) తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా అక్కడే స్థంబానికి ఉన్న కరెంట్ తీగలు కిందికి వేలాడుతుండడంతో అది గమనించకుండా అటువైపు మృతుడు చంద్రియా వెళ్లారు. ఆ విద్యుత్ తీగలు చంద్రియాకు తగలడంతో విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుని భార్య మోతి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Next Story

Most Viewed