విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి..
X

దిశ, యాచారం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పపహాడ్ గ్రామానికి చెందిన నిట్టు యాదయ్య (53) రోజు మాదిరిగానే సాయంత్రం పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో పక్క చేనులో వరి చేనుకు అడవి పందుల నుంచి రక్షణ కోసం విద్యుత్ తీగలు పెట్టిన విషయం తెలియక వాటికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి కూతురు , ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed