రైలు ఢీకొని వ్యక్తి మృతి...

by Taduka Kalyani |

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

రైలు ఢీకొని వ్యక్తి మృతి...
X

దిశ, ఇబ్రహీంపట్నం: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్ తెలిపిన వివరాల ప్రకారం...ఇబ్రహీంపట్నం మండలం సత్తెక్కపల్లె గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీంచగా రైలు ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. అయితే వ్యక్తి ముఖం గుర్తు పంటలేనంత గాయాలుండడంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మరణించాడా అనేది మాత్రం దర్యాప్తులో తేలనుందని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Next Story