ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, పరిగి: భార్య ఉండగా మరో మహిళ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిగి ఎస్ఐ పి. విటల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం యాబాజిగూడ గ్రామానికి చెందిన మాల కుమార్ భార్య పిల్లలు ఉన్నారు. వీరు కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. గ్రామానికి చెందిన మరో మహిళ తనను వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది.

దీంతో మనస్థాపానికి గురైన మాల కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story