మానసిక వేదనతో వ్యక్తి ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
మానసిక వేదనతో వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, మీర్ పేట్: మానసిక వేదనతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంబే కాలనీ నందనవనంలో నివాసం ఉంటున్న షేక్ సలీం (22) వృత్తిరీత్యా పెయింటర్. కొన్ని రోజులుగా మానసికంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో విషయం ఏంటో చెప్పాలని తన తల్లి సలీంను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదు. కాగా ఈ నెల 12వ తేదీన సలీం రాత్రి భోజనం చేసి వాకింగ్ కు వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లి ఇంటి తిరిగి రాలేదు.

చుట్టుపక్కన ప్రాంతాల్లో వెతికిన సలీం ఆచూకీ లభించలేదు. ఇది ఇలా ఉండగా ఆదివారం మందమల్లమ్మ చౌరస్తా సమీపంలో ఉన్న చెరువులో వ్యక్తి మృతదేహం లభించిందని పోలీసులు సలీం తల్లికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లి తన కుమారుడు సలీంగా గుర్తించింది. మానసిక వేదనతోనే సలీం చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవచ్చని భావిస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed