క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య.. కారణం అదే..

by Disha Web Desk 20 |
క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య.. కారణం అదే..
X

దిశ, భీమదేవరపల్లి : చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన కదిరె సదానందం (45) వృత్తిరీత్యా కూలీ పని చేస్తుండేవాడు. కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. అయితే చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో తన వ్యవసాయ భూమి వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం కు తరలించి చికిత్స అందిస్తుండగా, బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉండగా కూతురి వివాహం జరిగింది.

Next Story