పిల్లలు పుట్టడంలేదనే బాధతో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..

by Disha Web Desk 20 |
పిల్లలు పుట్టడంలేదనే బాధతో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..
X

దిశ, కాసిపేట : పిల్లలు పుట్టడంలేదనే బాధతో మద్యానికి బానిసై పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని రేగులగూడలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రేకులగూడకు చెందిన భీంరావుకు పెళ్లై కొన్నేండ్లు అవుతున్నా పిల్లలు పుట్టడంలేదని బాధపడేవారన్నారు.

ఆ బాధతోనే మద్యానికి బానిసయ్యాడని తెలిపారు. మంగళవారం తాగిన మైకంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుని భార్య లక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు దేవాపూర్ ఎస్ఐ విజేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed