కిరాణా షాప్ యజమాని పై వ్యక్తి కత్తితో దాడి..

by Disha Web Desk 20 |
కిరాణా షాప్ యజమాని పై వ్యక్తి కత్తితో దాడి..
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : కిరాణా షాపు యజమాని పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో నూకం కృష్ణ కిరాణా షాపువద్దకు నిందితులు పెద్దగోని అరవింద్, పెద్దగోని అభిరామ్, గోసుకొండ కార్తీక్, లోకేశ్, విశ్వతేజ్, షరీఫ్‌లు వచ్చారు.

ఈ సమయంలో అక్కడే ఉన్న నూకం గాలయ్యతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నిందితులు నూకం గాలయ్య పై చేయి చేసుకుంటుండంతో కిరాణాషాప్ యజమాని నూకం కృష్ణ వారిని అడ్డుకొని సర్ది చెప్పి ఇంటికి పంపించాడు. గొడవ జరిగిన కొంత సమయం తర్వాత నిందితుడు పెద్దగోని అరవింద్ ఈ విషయాన్ని తన మనసులో ఉంచుకుని కూరగాయల కత్తితో తిరిగి వచ్చి నూకం కృష్ణ పై దాడి చేశాడు. దీంతో కృష్ణ కడుపు పై ​​గాయాలు అయ్యాయి. జరిగిన సంఘటన పై బాధితుని భార్య నూకం కల్పన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు.

Next Story

Most Viewed