ఏపీలో దారుణం..ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2 లక్షల టోకరా, ప్రశ్నించడంతో దాడి

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని నమ్మించి రూ.2 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రశ్నించగా అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ఏపీలో దారుణం..ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2 లక్షల టోకరా, ప్రశ్నించడంతో దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని నమ్మించి రూ.2 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రశ్నించగా అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి చేస్తున్న సమయంలో వీడియో తీయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఏపీలోని అమలాపురంలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తామని మహేశ్ అనే దళిత యువకుడి వద్ద రూ.2 లక్షలు మోసం చేశారు.

డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతడిపై కర్రలు, బెల్టుతో దాడి చేశారు. ఈ ఘటనలో మహేశ్ తీవ్రంగా గాయపడగా మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులే దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన మహేశ్ తనపై శంకర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. అతడే డబ్బులు తీసుకుని తనను మోసం చేశాడని తెలిపాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. వీడియో

Next Story