ఛీ.. ఛీ.. స్మగ్లింగ్ కోసం చివరకు ఆ అవయవాన్ని కూడా వదల్లే!

by Disha Web Desk 19 |
ఛీ.. ఛీ.. స్మగ్లింగ్ కోసం చివరకు ఆ అవయవాన్ని కూడా వదల్లే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. నిర్ధిష్ట సమాచారంతో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో వింతేముంది అనుకోకండి.

అతగాడు చేసిన బంగారు స్మగ్లింగ్ తీరును చూసి ఎయిర్‌పోర్టు అధికారులు కూడా నివ్వెరపోయారు. పేస్ట్ రూపంలో బంగారాన్ని అతడు దాచిన ప్లేస్‌ను చూసి అధికారులు అవాక్కయ్యారు. అయితే ఆ ప్రయాణికుడు రూ. 42,78,768 విలువ గల, 685.7 గ్రాముల బంగారాన్ని పేస్ట్‌ రూపంలో పురీషనాళంలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


Next Story