కారు ఢీ కొని కూలి మృతి..

by Disha Web Desk 20 |
కారు ఢీ కొని కూలి మృతి..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : పొట్ట తిప్పల కోసం ఉన్న ఊరు విడిచి కూలిపనికి వస్తే కారు ఢీ కొన్న ప్రమాదంలో కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఉదయం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామ సమీపంలో బోధన్ హైదరాబాద్ ప్రధాన రహదారి పై చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామానికి చెందిన శీలం రాజయ్య (60) అనే వ్యక్తి కూలి పని చేసుకునేందుకు అక్కాపూర్ గ్రామం నుండి అదే గ్రామానికి చెందిన పుట్ట బాలరాజు, పల్లపు నరసింహ అనే వ్యక్తులతో కలిసి నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి వచ్చాడు.

ధర్మారెడ్డి గ్రామ శివారులో ప్రధాన రహదారి రోడ్డు వెంబడి సైడ్ బోర్ రంద్రాలు చేస్తుండగా గురువారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు మారుతి సుజుకి వేగానార్ కారు రోడ్డు ప్రక్కనే పనిచేస్తున్న శీలం రాజయ్యకు వేగంగా వచ్చి ఢీ కొనడంతో రాజయ్య ఆకడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుని కుమారుడు శీలం దేవరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Next Story

Most Viewed