చేపలు పట్టేందుకు వెళ్లి కూలీ మృతి

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల సంగప్ప (52) అనే కూలీ ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు.

చేపలు పట్టేందుకు వెళ్లి కూలీ మృతి
X

దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల సంగప్ప (52) అనే కూలీ ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. జీర్లపల్లి గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన సంగప్పకు చేపల వల కాలికి తగలడంతో సమతుల్యం కోల్పోయి నీటిలో పడిపోయి మునిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఝరాసంగం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుమారుడు పిచ్చకుంట్ల పాపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు.

Next Story