కోడిగుడ్ల కోసం వ్యక్తి కిడ్నాప్.. ఎక్కడంటే?

by Disha Web Desk 4 |
కోడిగుడ్ల కోసం వ్యక్తి కిడ్నాప్.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్బుల కోసమో, ఆస్తి కోసమో కిడ్నాప్ చేయడం తరచూ వార్తల్లో చూస్తునే ఉంటాం. కాగా ఓ వ్యక్తిని కోడిగుడ్ల కోసం కిడ్నాప్ చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లా బర్తోరీ గ్రామానికి చెందిన యోగేష్ స్థానికంగా ఓ బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం దీపక్, రాహుల్, పరమేశ్వర్ మద్యం తాగి వెళ్లారు. కౌంటర్లో కూర్చున్న యోగేష్ ను కోడిగుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డబ్బులు ఇస్తేనే కోడిగుడ్లు ఇస్తానన్నాడు. ఇదే విషయమై ముగ్గురు బిర్యానీ సెంటర్ ఓనర్ పై కోపం పెంచుకున్నారు. సాయంత్రం మళ్లీ హోటల్ కు వెళ్లి యోగేష్ తో గొడవకు దిగారు. వాగ్వాదం పెరగడంతో ఒక్కసారిగా ఓనర్ ను తమ కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. రాత్రి అయిన యోగేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వారు విచారణ చేపట్టి కొన్ని గంటల్లోనే యోగేష్ ను కాపాడారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.



Next Story