ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి.. 12మందికి గాయాలు

by Sujitha Rachapalli |

కర్ణాటక బళ్లారి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మస్కి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బైరాపూర్ క్రాస్‌ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి

ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి.. 12మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక బళ్లారి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మస్కి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బైరాపూర్ క్రాస్‌ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పన్నెండు మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి దారితీసిందని.. నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు పోయాయని తెలుస్తోంది. మృతులు చౌడసందకు చెందిన బాలనాయక్, మాళవళ్లికి చెందిన శ్వేతగా గుర్తించారు పోలీసులు. క్షతగాత్రులను బళ్లారి ట్రామా కేర్ సెంటర్, సిరుగుప్ప తాలూకా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించినట్లు తెలిపారు.

Next Story