కర్ణాటక మద్యం స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

by Dishafeatures2 |
కర్ణాటక మద్యం స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
X

దిశ, కళ్యాణదుర్గం: కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కంబదూరు సెబ్ సీఐ మొహద్దిన్ భాష చెప్పారు. శనివారం మల్లాపురం క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనఖిల్లో కళ్యాణదుర్గం కు చెందిన బోయ చిన్న, సోమశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవానంలో వస్తుండగా ఆపీ తనఖీలు చేయగా వారి వద్ద నుంచి 6 కేసుల హైవార్డ్స్ లిక్కర్ కర్ణాటక మద్యాన్ని గుర్తించి బైక్ తో పాటు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అలాగే కంబదూరు చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనఖిల్లో ఎరబోరేపల్లి బాలయోగి వద్దనుంచి ద్విచక్ర వాహనంతో పాటు 96 కర్ణాటక టెట్రా మద్యం ప్యాకెట్లను స్వాధీన పరచుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈమేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సెబ్ సీఐ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed