పంజా విసిరిన ఐటీ అధికారులు.. DSR కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కొనసాగుతోన్న రెయిడ్స్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ మహా నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.

పంజా విసిరిన ఐటీ అధికారులు.. DSR కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కొనసాగుతోన్న రెయిడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లతో పాటు ఏక కాలంలో మొత్తం 10 చోట్ల రెయిడ్స్ కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో పన్నుల చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు పాల్పడ్డారనే కారణంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story