పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి

by Dishafeatures2 |
పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి
X

దిశ, కడప: పిడుగుపాటుకు గురై ఆరు పాడి గేదెలు మృత్యువాత పడ్డ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వేముల మండలం బెస్తవారిపల్లె గ్రామంలోని గాండ్లపెంట బాబు అనే రైతుకు తొమ్మిది పాడి గేదెలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు రావడంతో రైతు ఆ పాడి గేదెలను ఊరి చివరన ఉన్న వేప చెట్టుకింద కట్టేశాడు. అయితే ఆ చెట్టుపై పిడుగు పడటంతో ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇక మిగతా మూడు గేదెలు ప్రాణాలతో బయటపడ్డాయి. జీవానాధారమైన పాడి గేదెలు మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. గేదెల మృతితో మూడు లక్షల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాబు కుటుంబ సభ్యలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Next Story

Most Viewed