పిల్లలను కనమన్నందుకు ముగ్గురిని సుత్తితో కొట్టి చంపిండు

by Dishafeatures2 |
పిల్లలను కనమన్నందుకు ముగ్గురిని సుత్తితో కొట్టి చంపిండు
X

దిశ, వెబ్ డెస్క్: పిల్లలను కనాలని సూచించినందుకు ముగ్గురిని సుత్తితో కొట్టి చంపాడో వ్యక్తి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాబిన్ అలియాస్ మున్నా అనే ఓ వ్యక్తి పక్కింట్లో కౌర్ (70), ఆమె భర్త చమన్ లాల్ (75), ఆమె అత్త (సుమారు 90 ఏళ్లు) ఉంటున్నారు. మున్నాకు పెళ్లై కొన్నేళ్లు అవుతున్నా సంతానం కలగలేదు. దీంతో పక్కింట్లో ఉంటున్న సురీందర్ కౌర్, ఆమె భర్త చమన్ లాల్ మున్నాను పిల్లలు కనాలని అడిగేవారని చెప్పారు.

అయితే గురువారం కూడా ఇలా ఒకరి తర్వాత వాళ్లు అతడిని సంతానమం విషయమై మాట్లాడారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మున్నా సుత్తితో ఆ ముగ్గురి తలపై కొట్టాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని కమిషనర్ మన్ దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు.



Next Story

Most Viewed