బీజేపీ నాయకుడి ఇంట్లో చోరీ

by Dishafeatures2 |
బీజేపీ నాయకుడి ఇంట్లో చోరీ
X

దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో గాంధీనగర్ కాలని కి చెందిన బీజేపీ పట్టణ పట్టణ అధ్యక్షులు కిరణ్ ఇంట్లో లేని సమయంలో దొంగల పడినట్లు స్థానికులు తెలిపారు. అయితే స్థానికులు తెలిపిన వివరాల మేరకు బిజెపి పట్టణ అధ్యక్షులు కిరణ్ సొంత పనుల నిమిత్తం చెన్నై లో ఉండగా దొంగలు అదును చూసుకొని దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కిరణ్ ఇంటికి మంచినీరు సరఫరా చేసే వ్యక్తులు ప్రతిరోజు లాగే నీటిని సరఫరా చేసేందుకు వాటర్ క్యాన్లుతో వెళ్ళగా తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉండడంతో నీటిని సప్లై చేసే వ్యక్తులు కిరణ్ ను ఫోన్లో సంప్రదించగా కిరణ్ సొంత పనుల నిమిత్తం చెన్నైలో ఉన్నట్టు తెలిపారు.

అలాగే పట్టణంలో ఉన్న తమ బంధువులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు సమాచారం అందుకున్న బంధువులు పోలీసులకు సమాచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా రెండు పెద్ద ఎల్ఈడి టీవీలు ఐదు తులాల బంగారం చోరీకి గురి అయినట్టు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు.

Next Story

Most Viewed