బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు

by Disha Web Desk 1 |
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రానికి చెందిన సంపంగి రమేష్ ను జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు నాటు సారా తయారీ కేసులో తహసీల్దార్ ఎదుట హాజరుపరచగా ఒక సంవత్సరం కాలంతో పాటు, రూ.లక్ష పూచికత్తుపై బైండోవర్ చేయగా, జరిమాన చెల్లించినందుకు జైలు శిక్ష విధించారు. సంపంగి రమేష్ నిబంధనలు పూర్తిగా అతిక్రమిస్తూ జరిమానా విధించినా కూడా మళ్లీ నాటు సారా తయారు చేస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని తహసీల్దార్ అనుపమ ఎదుట హాజరు పరచగా అతడికి రూ.లక్ష జరిమానా విధించారు. సదరు వ్యక్తి జరిమానా చెల్లించనందుకు గాను జైలు శిక్ష విధించారు. ఈ మేరకు సంపంగి రమేష్ ను అరెస్టు చేసి కరీంనగర్ జైలుకి రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ సీహెచ్ సామ్యాల్ ఆనందరావు తెలిపారు.


Next Story