భార్య, భర్త మధ్య చిచ్చు పెట్టిన మాంసం.. చివరికి జరిగింది ఇదే!

by Disha Web Desk 6 |
భార్య, భర్త మధ్య చిచ్చు పెట్టిన మాంసం.. చివరికి జరిగింది ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: భార్య, భర్తలు ఏ విషయంలోనైనా అర్థం చేసుకుని జీవించాలి. కానీ, కొంత మంది ఏదో కారణాలతో గొడవలు పడుతూ భాగస్వామి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో హృదయ విదారక ఘనట చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లో సగీర్ అనే వ్యక్తి భార్య గుడ్డో, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే మాంసం తీసుకురాలేదని సగీర్ భార్యతో గొడవ పడ్డాడు. అది కాస్త పెరిగి కోపంతో ఊగిపోయిన సగీర్ పిల్లల ముందే భార్యను గొంతు కోసి చంపేశాడు. దీంతో ఇది చూసిన పిల్లలు స్థానికులకు చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


Next Story