వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు స్పాట్ డెడ్

by Disha Web Desk 19 |
వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ జంటను ఒడిశాలోని అత్తగారింటికి వెళ్తుండగా ట్రాక్టర్ రూపంలో మృత్యువు వెంటాడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతులను సింహాచలం, ప్రవళికగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : కొమురం భీం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Next Story

Most Viewed