అమావాస్య ఎఫెక్ట్: పండుగపూట హైదరాబాద్‌లో సంచలనం

by Disha Web Desk 2 |
అమావాస్య ఎఫెక్ట్: పండుగపూట హైదరాబాద్‌లో సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో పండుగపూట సంచలన ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ సమీపంలోని హైదర్‌నగర్‌లోని స్మశానంలో క్షుద్రపూజల అనంతరం నరబలి చేయడం నగరాన్ని కుదిపేస్తోంది. యువకుడిని కొందరు గుర్తుతెలియని దుండగులు చంపి తగులబెట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. రేపు(మంగళవారం) అమావాస్య కావడంతో పాటు సూర్యగ్రహణం ఉన్న నేపథ్యంలో యువకుడిని బలి ఇచ్చి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహం ఎవరిదో గుర్తించే పనిలో పడ్డారు. క్షుద్రపూజలు చేసినది ఎవరనే దారిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed