లోన్ల పేరుతో భారీ స్కామ్.. బ్యాంకు నోటీసులతో షాకైన గిరిజనులు

by Naga Rani Yarlagadda |

నెల్లూరు జిల్లా ముత్తుకూరులో లోన్ల పేరుతో భారీ స్కామ్‌కు తెరతీశారు కేటుగాళ్లు. 56 మంది పేర్లమీద లోన్లు తీసుకుని, ఆ సొత్తునంతా కాజేసింది ముఠా.

లోన్ల పేరుతో భారీ స్కామ్.. బ్యాంకు నోటీసులతో షాకైన గిరిజనులు
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో లోన్ల పేరుతో భారీ స్కామ్‌కు తెరతీశారు కేటుగాళ్లు. 56 మంది పేర్లమీద లోన్లు తీసుకుని, ఆ సొత్తునంతా కాజేసింది ముఠా. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనుల్ని ఉద్యోగులుగా చూపించి, వారి పేర్లపై రూ.10.60 కోట్ల లోన్ తీసుకున్నారు. ఎవరి పేర్లమీదైతే లోన్లు మంజూరయ్యాయో వారికి లోన్ కట్టాలని బ్యాంక్ నోటీసులు పంపడంతో.. ఏ పాపం ఎరుగని గిరిజనులు షాకయ్యారు. తమకేమి తెలియదని, మోసం చేసి ఇదంతా చేశారని వాపోయారు. వెంటనే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిరిజనుల పేరుమీద లోన్లు తీసుకున్నవారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story