- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
దిశ, శంషాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుండి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు మహిళలు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుండి (EK-528) ఎమిరేట్స్ విమానంలో నహిత్ సుల్తానా, ఆర్గాన్స్ బేగం ఇద్దరు మహిళలు హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి లగేజ్ బ్యాగులను స్కానింగ్ చేయగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు మహిళలు 24 క్యారెట్ల బంగారు చైన్లను లగేజ్ బ్యాగులో పెట్టుకొని తరలిస్తుండగా వారి వద్ద నుండి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 74 లక్షల 2 వేల 500 రూపాయల విలువ చేసే 1 కిలోల 410 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరి మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.