శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

by Disha Web Desk 20 |
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
X

దిశ, శంషాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుండి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు మహిళలు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుండి (EK-528) ఎమిరేట్స్ విమానంలో నహిత్ సుల్తానా, ఆర్గాన్స్ బేగం ఇద్దరు మహిళలు హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి లగేజ్ బ్యాగులను స్కానింగ్ చేయగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు మహిళలు 24 క్యారెట్ల బంగారు చైన్లను లగేజ్ బ్యాగులో పెట్టుకొని తరలిస్తుండగా వారి వద్ద నుండి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 74 లక్షల 2 వేల 500 రూపాయల విలువ చేసే 1 కిలోల 410 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరి మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed