ఘోరం.. ఫిలిప్పీన్స్‌లో పంజాబ్ దంపతుల దారుణ హత్య..

by Disha Web Desk 9 |
ఘోరం.. ఫిలిప్పీన్స్‌లో పంజాబ్ దంపతుల దారుణ హత్య..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు దంపతులు ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి వారిని కాల్చిచంపిన ఘోరమైన ఘటన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. చెందిన ఇద్దరు దంపతులు ఫిలిప్పీన్స్ లో హత్యకు గురయ్యారు. సుఖ్వీందర్ సింగ్ (41), కిరణ్ దీప్ కౌర్ (33)గా గుర్తించారు. సుఖ్వీందర్ గత 19 ఏళ్లుగా మనీలాలో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య ఇటీవలే అక్కడికి వెళ్లారు. ఆయన సోదరుడు సుఖ్విందర్ లఖ్వీర్ సింగ్ కూడా వారితోనే కలిసి నివసిస్తున్నాడు. కానీ ఈ ఘటన జరిగిన సమయంలో అతడు కుటుంబ కార్యక్రమం కోసం ఇండియాకు వచ్చారు. కాగా.. సుక్వీందర్ తన పనులు ముగించుకొని సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఒక్క సారిగా తుపాకీ తీసి బాధితుడిపై కాల్పులు జరిపాడు. దీంతో సుక్వీందర్ అక్కడే కుప్పకూలిపోయాడు.

ఆ కాల్పుల శబ్దం విన్న అతని భార్య ఏం జరిగిందని బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లగా.. డోర్ దగ్గరికి చేరుకునే సరికే ఆ దుండగుడు ఆమెపై కూడా కాల్చి చంపాడు. ఇదంతా వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సుఖ్వీందర్‌కు అతని సోదరుడు ఆదివారం నుంచి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయడం లేదని మరుసటి లఖ్వీర్ తన మామయ్యతో కలిసి పంజాబ్‌కు వెళ్లారు. వారు అక్కడికి వెళ్లి చూసేసరికి, సుఖ్వీందర్ సింగ్, అతని భార్య కిరణ్ దీప్ కౌర్ రక్తపు మడుగులో పడి ఉన్నది చూసి వారు విస్తుపోయారు. తమ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని లఖ్వీర్ అన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు ఫిలిప్పీన్స్‌లోని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. దీంతో నేరానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయవచ్చని తెలిపారు. అలాగే మెహసంపూర్ గ్రామంలో ఉన్న మృతుల కుటుంబాలకు సోమవారం సాయంత్రం సమాచారం అందింది.


Next Story

Most Viewed