శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..

by Disha Web Desk 11 |
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
X

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టు బడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగును, వ్యక్తులను స్కానింగ్ చేయడంతో వారి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ప్రయాణికులు బంగారం పేస్టును 6 క్యాప్సూల్స్ లో అమర్చి ఇద్దరు ప్రయాణికులు తమ పురుష నాళంలో పెట్టుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కోటి 5 లక్షల 21 వేల 701 రూపాయల విలువ చేసే కిలో 705.3 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకొని ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


Next Story

Most Viewed