శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..

by Disha Web Desk 20 |
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
X

దిశ, శంషాబాద్ : గుట్టుచప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం దుబాయ్ నుండి (EK-526) విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా కేరళకు చెందిన ఓ ప్రయాణికుడి పై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ప్రయాణికుడు బంగారం పేస్టును ప్రత్యేకంగా కవర్లో చుట్టి నడుము భాగంలో అతికించుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 1 కోటి 10 లక్షల 06 వేల 250 రూపాయల విలువ జేసే 1 కిలో 761 గ్రాముల బంగారం పేస్టును స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసునమోదు చేసి విచారిస్తున్నారు.



Next Story

Most Viewed