అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి..

by Disha Web Desk 20 |
అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి..
X

దిశ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్ కి చెందిన జి.సుధాకర్ అనారోగ్యంతో విధినిర్వహణలో గురువారం సాయంత్రం మరణించాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సుధాకర్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సుధాకర్ కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు కుమారస్వామి, యాదగిరి, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.



Next Story

Most Viewed