మనవరాలి బెడ్ రూంలో నుంచి రాత్రి వింత శబ్దాలు.. ఏంటని చూసినందుకు కిరాతకంగా నానమ్మ హత్య.. అసలేం జరిగిందంటే..

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-13 19:58:49  IST  )

ఉత్తరప్రదేశ్ జలౌన్‌‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తుండగా చూసిన నానమ్మను కిరాతకంగా హత్య చేసింది మనవరాలు. వివరాల్లోకి వెళ్తే.. 21ఏళ్ల పల్లవి బెడ్ రూంలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి ఆమె నానమ్మ పర్మా దేవికి. దీంతో ఆమె

మనవరాలి బెడ్ రూంలో నుంచి రాత్రి వింత శబ్దాలు.. ఏంటని చూసినందుకు కిరాతకంగా నానమ్మ హత్య.. అసలేం జరిగిందంటే..
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ జలౌన్‌‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తుండగా చూసిన నానమ్మను కిరాతకంగా హత్య చేసింది మనవరాలు. వివరాల్లోకి వెళ్తే.. 21ఏళ్ల పల్లవి బెడ్ రూంలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి ఆమె నానమ్మ పర్మా దేవికి. దీంతో ఆమె వెళ్లి చూసేసరికి బాయ్ ఫ్రెండ్ దీపక్‌తో శృంగారంలో పాల్గొంది మనవరాలు. ఈ విషయాన్ని గమనించిన పల్లవి.. ఇంట్లో వాళ్లతో చెప్తుందనే భయంతో వెంటనే నానమ్మపై ఎటాక్ చేసింది. గ్రైండింగ్ స్టోన్‌తో తలపై బాదడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత దీపక్ పారిపోగా.. పల్లవి దొంగలు వచ్చారని నాటకం ఆడింది. దీంతో ఆమె తండ్రి పోలీసు కేసు ఫైల్ చేయగా.. ఇన్వెస్టిగేషన్‌లో హంతకురాలు మనవరాలేనని తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. దీపక్ కోసం వెతుకుతున్నారు.

Next Story