మేడారంలో పూజారి దారుణ హత్య

by Disha Web Desk 12 |
మేడారంలో పూజారి దారుణ హత్య
X

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా మేడారం గ్రామంలో దారుణ హత్య జరిగిన ఘటన నెలకొంది. స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాయి గ్రామం గోవిందరాజుల పూజారిగా వ్యవహరిస్తున్న దబ్బకట్ల రవి(45) మంగళవారం ఉదయం మేడారం గ్రామంలో హత్యకు గురై కనిపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు సమాచారం. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై స్థానిక తాడ్వాయి ఎస్సై‌కి దిశ ఫోన్ చేయగా ఇప్పటివరకు ఎలాంటి పిటిషన్ రాలేదని పిటిషన్ రాగానే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు.



Next Story