కొచ్చిలో రూ.1.40 కోట్ల విలువచేసే బంగారం స్వాధీనం

by Dishafeatures2 |
కొచ్చిలో రూ.1.40 కోట్ల విలువచేసే బంగారం స్వాధీనం
X

న్యూఢిల్లీ: కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో రూ.1.40 కోట్ల విలువ చేసే బంగరాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు 2.67 కేజీల బంగారాన్ని పట్టుకున్నట్లు శనివారం వెల్లడించారు. అబుదాబీ నుంచి వచ్చిన ప్రయాణికుడిని గ్రీన్ ఛానెల్ ద్వారా గుర్తించిన కస్టమ్స్ అధికారులు కనిపెట్టారు.

మల్లప్పురం కు చెందిన అబ్దుల్ సలీమ్ శరీరంలో మూడు బంగారు క్యాప్సూల్స్ ను గుర్తించగా, మరో కేసులోనూ అబుదాబీ నుంచి వచ్చిన ప్రయాణికుడిలో కేజీకి పైగా బరువున్న 4 క్యాప్సుల్స్ ను కనుగొన్నట్లు తెలిపారు. దీంతో పాటు ఇన్నర్ వస్త్రాలతో మరో 600 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed